దళితులపై కేసీఆర్‌ది మొసలి కన్నీరే..!

హైదరాబాద్‌లో బిర్లామందిర్ దగ్గర ప్రాంతంలో అత్యాచారానికి గురైన దళిత బాలిక కుటుంబాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. 

Last Updated : Jul 2, 2018, 10:46 PM IST
దళితులపై కేసీఆర్‌ది మొసలి కన్నీరే..!

హైదరాబాద్‌లో బిర్లామందిర్ దగ్గర ప్రాంతంలో అత్యాచారానికి గురైన దళిత బాలిక కుటుంబాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన అధికార టీఆర్‌ఎస్ పార్టీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అయినా సరే.. ఆ ప్రాంతంలో దళితులకు ఎలాంటి రక్షణా లేకుండా పోయిందని.. ఈ ఘటనకు కచ్చితంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన తెలిపారు.

దళితుల కోసం కేసీఆర్ చేస్తున్నదేమీ లేదని.. ఆయన కారుస్తుంది కేవలం మొసలి కన్నీరని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా షెడ్యూల్ కులాలకు సంబంధించిన కేసుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని.. అందుకు గాను వేరే పర్యవేక్షణ కమిటీని వేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని నగరంలో ఇంత దారుణమైన ఘటన జరిగితే కనీసం నగర పోలీస్ కమీషనరు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం దారుణమన్నారు. వెంటనే ప్రభుత్వం బాధితురాలిని ఆదుకోవాలని ఆయన తెలిపారు. 

Trending News