బీజేపిలోకి మరో ఇద్దరు కీలక నేతలు

బీజేపిలోకి మరో ఇద్దరు కీలక నేతలు

Last Updated : Sep 4, 2019, 11:50 AM IST
బీజేపిలోకి మరో ఇద్దరు కీలక నేతలు

తెలంగాణలో ఇప్పటికే టీడీపి, కాంగ్రెస్ నుంచి పలువురు కీలక నేతలు బీజేపిలో చేరగా.. ఇంకొందరు నేతలు కాషాయం కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. తెలంగాణలో ఒకప్పుడు ముఖ్య నేతల్లో ఒకరిగా పేరున్న రేవూరి ప్రకాష్‌రెడ్డి, రవీంద్ర నాయక్ ఇద్దరూ ఇవాళ ఢిల్లీలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. 

నేడు ఢిల్లీకి వెళ్తున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.. అక్కడ కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగానే లక్ష్మణ్‌తోపాటు ఢిల్లీకి వెళ్లనున్న రేవూరి ప్రకాష్ రెడ్డి, రవీంద్ర నాయక్ ఇద్దరూ అమిత్ షా సమక్షంలో బీజేపిలో చేరనున్నారని తెలుస్తోంది.

Trending News