AP Corona cases: ఆంధ్రప్రదేశ్​లో కరోనాతో ఒక్క రోజే 12 మంది మృతి!

AP Corona cases: రాష్ట్రంలో కరోనా కొత్త కేసులు 13 వేల దిగువకు చేరాయి. అయితే మరణాలు మాత్రం భారీగా నమోదయ్యాయి. గుంటూరులో అత్యధికంగా యాక్టివ్ కేసులున్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2022, 05:54 PM IST
  • రాష్ట్రంలో దిగొచ్చిన కరోనా కేసులు
  • క్రితం రోజుతో పోలిస్తే తగ్గి టెస్టుల సంఖ్య
  • మరణాల్లో మాత్రం భారీ వృద్ధి
AP Corona cases: ఆంధ్రప్రదేశ్​లో కరోనాతో ఒక్క రోజే 12 మంది మృతి!

AP Corona cases: ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే భారీగా తగ్గాయి.

గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు .. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 12,561 మందికి కరోనా పాజిటివ్​గా​ (Corona cases in AP) తేలినట్లు ఏపీ ఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం ప్రకటించింది.

24 గంటల వ్యవధిలో 40,635 శాంపిళ్లను పరీక్షించగా.. ఈ కేసులు బయపడ్డట్లు వెల్లడించింది ఆరోగ్య విభాగం. క్రితం రోజుతో పోలిస్తే టెస్టుల సంఖ్య తగ్గింది.

రికవరీలు ఇలా..

రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 8,742 మంది కొవిడ్ నుంచి సంపూర్ణంగా కోలుకున్నట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ. ఇప్పటి వరకు మొత్తం 2,120,717 మంది కరోనాను జయించారు.

మరణాలు..

ఇక కరోనా మృతుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో కొవిడ్ కారణంగా రాష్ట్రంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర (Corona deaths in AP) ఆరోగ్య శాఖ వివరించింది. విశాఖపట్నంలో ముగ్గురు, కర్నూలు, నెల్లూరులో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.

ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు 14,591 మంది కొవిడ్​కు బలయ్యారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,13,300 యాక్టివ్ కరోనా (Corona Active cases in India) కేసులున్నాయి.

జిల్లాల వారీగా యాక్టివ్ కేసులు..

గుంటూరులో అత్యధికంగా 12,315 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు తెలిపింది ఆరోగ్య విభాగం. ఆ తర్వాత విశాఖపట్నంలో 12,272 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. పశ్చిమ గోదావరిలో అత్యల్పంగా 3,888 యాక్టివ్​ కరోనా కేసులు ఉన్నాయి. మిగతా అన్ని జిల్లాలలో నాలుగు వేలకుపైనే యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య విభాగం డేటాలో వెల్లడైంది.

ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 3,23,65,775 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. అందులో 2,248,608  శాంపిళ్లు పాజిటివ్​గా తేలినట్లు వివరించింది.

మొత్తం కేసుల్లో ఏపీకి చెందిన వారితో పాటు రాష్ట్రానికి వచ్చిన ఇతర రాష్ట్రాల వారు, విదేశీయులు కూడా ఉన్నట్లు ఆరోగ్య శాఖ వివరించింది.

Also read: APSRTC JAC: ఏ క్షణమైనా బస్సులను ఆపేందుకు సిద్ధమైన ఏపీ ఆర్టీసీ జేఏసీ

Also read: టీడీపీకి బిగ్ షాక్... వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, మాజీ ఎంపీ శంకరరావు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News