విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగి తీరుతుందంటున్న కేంద్ర ప్రభుత్వం

Central government: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం హాట్ టాపిక్‌గా మారుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తరచూ ఈ అంశం తెరపైకి వస్తోంది. ఓ వైపు ఉద్యోగుల నిరసన కొనసాగుతుంటే..మరోవైపు కేంద్రం తన వైఖరిపై పట్టు బిగిస్తోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 2, 2021, 04:41 PM IST
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగి తీరుతుందంటున్న కేంద్ర ప్రభుత్వం

Central government: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం హాట్ టాపిక్‌గా మారుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తరచూ ఈ అంశం తెరపైకి వస్తోంది. ఓ వైపు ఉద్యోగుల నిరసన కొనసాగుతుంటే..మరోవైపు కేంద్రం తన వైఖరిపై పట్టు బిగిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్ పరం( Visakha steel plant privatisation) చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు రోడ్డెక్కి చేస్తున్న నిరసన కొనసాగుతోంది. కార్మికుల సమ్మెకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నిరసన తెలుపుతున్నారు. స్పీకర్ పోడియంలో దూసుకెళ్లి ఈ అంశంపై నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు విశాఖ నుంచి ఉద్యోగుల నిరసన ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నాకు దారి తీసింది. ఇంకోవైపు ఇదే అంశంపై మాజీ సీబీఐ అధికారి జేడీ లక్ష్మీ నారాయణ ఏపీ హైకోర్టు(Ap High Court)లో పిటీషన్ దాఖలు చేశారు. 

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఓ వైపు నిరసన కొనసాగుతున్నా కేంద్ర ప్రభుత్వం(Central government) మాత్రం తన వైఖరి నుంచి వెనక్కి తగ్గడం లేదు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి వెనక్కి తగ్గేది లేదని..ఇప్పటికే బిడ్స్ ఆహ్వానిస్తున్నామని ఏపీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ సైతం దాఖలు చేసింది. మరోవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో(Parliament Monsoon Sessions) కూడా ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. ప్రైవేటీకరణ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేది లేదని..ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపింది. ఈ అంశంపై ఎంపీ సజ్జాద్ అహ్మద్ సహా మరో ఇద్దరు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. అదే సమయంలో స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, భాగస్వాముల సమస్యల్ని పరిష్కరిస్తామని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తాజా వైఖరితో స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల నిరసన ఎటు దారితీస్తుందో అనే చర్చ ప్రారంభమైంది. 

Also read: కరోనా కాటుకు దేశవ్యాప్తంగా అనాధలుగా మారిన 75 వేలమంది చిన్నారులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News