21 ఏళ్ల మృగాడికి 23 రోజుల్లో మరణశిక్ష విధించిన కోర్టు

నాలుగు నెలల పసిపాపపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనలో సునీల్ భీల్ (21)అనే కామంధుడికి ఇండోర్ జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది.

Last Updated : May 13, 2018, 12:56 PM IST
21 ఏళ్ల మృగాడికి 23 రోజుల్లో మరణశిక్ష విధించిన కోర్టు

నాలుగు నెలల పసిపాపపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనలో సునీల్ భీల్ (21)అనే కామంధుడికి ఇండోర్ జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. కేసు నమోదైన 23 రోజుల్లోనే వేగవంతమైన తీర్పును వెల్లడించింది. తల్లి ఒడిలో ముద్దుగా నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్ళి నవీన్ ఈ దారుణానికి ఒడిగట్టాడు.  

ఈ కేసును చాలా అరుదైన కేసుగా పరిగణించి, ముద్దాయికి మరణశిక్ష విధించాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కోర్టు న్యాయమూర్తి ఏడవడం  తప్ప ఏమీ తెలియని పసిపాపపై  ఇది అమానుష చర్యగా వ్యాఖ్యానించారు. ఏప్రిల్‌ 20న ఇండోర్ నగరంలోని రాజ్‌వాడా ఫోర్ట్‌ సమీపంలో  త‌ల్లిపక్కనే నిద్రిస్తున్న నాలుగు నెల‌ల చిన్నారిని ఎత్తుకెళ్లిన  నవీన్‌ అత్యాచారం చేసి అనంత‌రం హ‌త్య చేయడం కలకలం రేపింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఏప్రిల్ 21న నిందితుడిని అరెస్టు చేశారు.  

కాగా 12 ఏళ్లలోపు వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్ష విధించే ఆర్డినెన్స్‌ను ఇటీవల కేంద్రం ఆమోదించడం..దీనికి రాష్ట్రపతి సమ్మతించిన  సంగతి తెలిసిందే!

Trending News