MS Dhoni: దళపతి విజయ్‌తో కలిసి వెండితెరపై ఎంట్రీకి ఎంఎస్ ధోని రెడీ

MS Dhoni-Thalapathy Vijay: ఎంఎస్ ధోని సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దళపతి విజయ్ కలిసి వెండితెరపై ఎంట్రీ ఇవ్వనున్నాడని ప్రచారం జరుగుతోంది. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Aug 15, 2023, 11:17 AM IST
MS Dhoni: దళపతి విజయ్‌తో కలిసి వెండితెరపై ఎంట్రీకి ఎంఎస్ ధోని రెడీ

MS Dhoni-Thalapathy Vijay: క్రికెట్ మైదానంలో మెరుపులు మెరిపించిన అభిమానులను అలరించిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోని.. నటుడిగా మారనున్నాడు. వెండితెరపై ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తమిళ స్టార్ దళపతి విజయ్‌తో కలిసి తన సినీ రంగ ప్రవేశం చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోని.. ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుకు ఈ ఏడాది ఐదో ఐపీఎల్‌ ట్రోఫీని కూడా అందించాడు. 41 ఏళ్ల వయస్సులోనూ కుర్రాళ్లకు పోటీగా ధోని యాక్టివ్‌గా ఉంటూ పూర్తి ఫిట్‌నెస్‌తో గ్రౌండ్‌లో యాక్టివ్‌గా ఉంటున్నాడు. సీఎస్‌కే జట్టుకు కెప్టెన్‌గా ఉండడంతో తమిళనాడుతో ధోనికి సన్నిహిత సంబంధం ఏర్పడింది. అభిమానులు తలైవా అని ధోనిని పిలుచుకుంటారు. ధోని సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా.. రూమర్లు సోషల్ మీడియాలో అభిమానులకు ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి.

ధోని భార్య సాక్షి ఇప్పటికే నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సినిమాలను నిర్మిస్తున్నారు. ఇటీవలే 'లెట్స్ గెట్ మ్యారేడ్' అనే తమిళ చిత్రంతో మొదలు పెట్టింది. సాక్షి ధోని కూడా తన భర్త సినిమా అరంగేట్రం చేయడాన్ని ఎప్పుడు తోసిపుచ్చలేదు. "మంచి కథ, మంచి సందేశం ఉన్న పాత్ర వస్తే ఎంఎస్ ధోని సినిమాలో నటించేందుకు ఆలోచిస్తాడు" అని సాక్షి ధోని గతంలో చెప్పారు.

సూపర్ స్టార్ దళపతి విజయ్‌తో కలిసి ధోని నటించనున్న మూవీకి నటీనటుల ఎంపిక జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. అక్టోబర్‌లో మూవీ సెట్స్‌ తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారట. 2024 దీపావళి కానుకగా అభిమానుల ముందుకు తీసుకున్నారని తెలుస్తోంది. ఎల్‌జీఎమ్‌ మూవీ కాకుండా ఎంఎస్ ధోని ఎంటర్టైన్మెంట్  రోర్ ఆఫ్ ది లయన్, ది హిడెన్ హిందూ మరియు బ్లేజ్ టు గ్లోరీ అనే మరో రెండు చిన్న సినిమాలను నిర్మించింది. యాక్షన్ చిత్రాలకు ధోని బాగా సరిపోతాడని సాక్షి చెబుతున్నారు. ధోనిని హీరోగా పెట్టి సినిమా చేయాలని ప్లాన్ చేస్తే.. అది యాక్షన్ ఎంటర్ టైనర్ మాత్రమే అవుతుందన్నారు. ధోని వెండితెరపై కనిపించే అవకాశం ఉండడంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషి అవుతున్నారు.

 

Trending News