గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 150 స్థానాలకు 1,122 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ (TRS) ఒక్కటే 150 డివిజన్లలో తమ అభ్యర్థులను పోటీకి నిలిపింది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరు ఊపందుకుంటుంది. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అరాచకాలపై బీజేపీ ఛార్జిషీటు విడుదల చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ చేరుకున్న కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ ఛార్జిషీటు విడుదల చేశారు.
బీహార్ ఎన్నికల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Election ) మజ్లీస్ పార్టీ (AIMIM) ఐదు సీట్లు గెలుపొందిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకస్థానానికే పరిమితమైన మజ్లీస్.. ఈ ఎన్నికల్లో సత్తచాటింది. అయితే కొత్తగా ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్యేలు ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) ని కలిశారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Election ) పోరు తుది దశకు చేరుకుంది. మూడో విడత ఎన్నికల్లో (last phase of bihar polls) భాగంగా 15 జిల్లాల్లోని 78 స్థానాల్లో.. అదేవిధంగా ఉపఎన్నిక జరిగే వాల్మీకినగర్ (Balmiki Nagar) లోక్సభ నియోజకవర్గంలో కూడా ఈ రోజు ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.
Asaduddin Owaisi Tweet Over Hyderabad Rains and Floods | టాలీవుడ్ నటీనటులు, దర్శకులు, ఇతర మూవీ యూనిట్ వర్గాలు తమ వంతు సాయాన్ని విరాళాల రూపంలో ప్రకటించారు. హైదరాబాద్ వరదలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) స్పందించారు.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పుపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi On Babri Masjid Demolition Verdict) తీవ్ర స్థాయిలో స్పందించారు.
నిర్మల్ జిల్లా భైంసా అల్లర్లకు ( Bhainsa riots ) ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బీజేపి ఎంపీ సోయం బాపూరావు ( BJP MP Soyam Bapu Rao ) డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కలెక్టర్, ఎస్పీలు ప్రజలను తప్పుదోవ పట్టించి, ఏమీ తెలియని అమాయకులపై కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ బెంగళూరులో నిర్వహించిన ర్యాలీలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ ఓ యువతి నినాదాలు చేయడం కలకలం రేపింది. ఆ సమయంలో అసదుద్దీన్ ఒవైసీ వేదికమీద ఉన్నారు.
ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీపై హత్యాయత్నం ఆరోపణలతో జైలుకెళ్లి ఇటీవల విడుదలైన మహమ్మద్ పహిల్వాన్ గుండెపోడుతో కన్నుమూశాడు. ఆయనకు సంతానం ముగ్గురు కుమారుడు,ఇద్దరు కుమార్తెలున్నారు.
పౌరసత్వ సవరణ చట్టం-2019కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజకీయ రంగు పులుముకున్న తర్వాత అధికారంలో ఉన్న బీజేపీ, మిగతా విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
పాతబస్తీలోని లాల్ దర్వాజలో ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఎంఐఎం శాసనసభా పక్ష నాయకుడు, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కోరారు. ప్రగతి భవన్ లో ఆదివారం ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు ఆయన విజ్ఞాపన పత్రం అందచేశారు.
JBS and MGBS Metro Route: హైదరాబాద్లో ఫిబ్రవరి 7 నుంచి మరో 11 కి.మీ మేర మెట్రో రైలు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. అయితే తమ ప్రాంతంలో మెట్రో రైలు ఎప్పుడు పరుగులు పెడుతుందో చెప్పాలంటూ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి తారా స్థాయికి చేరుకుంది. పోలింగుకు ఇంకా నాలుగు రోజులే ఉండటంతో అన్నీ ప్రధాన పార్టీలు తమ ప్రచారాలన్నీ ఉదృతం చేశాయి. ఇందులో భాగంగా శనివారం కామారెడ్డిలో మజ్లీస్ నేత ఎంపీ అసదుద్దిన్ ఓవైసి మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించండి అని అయన ఓటర్లకు పిలుపునిచ్చారు.
జేఎన్యూలోకి దుండుగులు ప్రవేశించి దాడి చేసిన ఘటనలో 28 మంది విద్యార్థులకు గాయాలైనట్లు తెలుస్తోంది. కొందరు విద్యార్థులు తలకు కట్లతో కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.