రాహుల్‌ను కలిసేందుకు వెళ్లిన నారా బ్రాహ్మణి

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోడలు, ఏపీ మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణకు చేరుకున్నారు.

Last Updated : Aug 14, 2018, 04:07 PM IST
రాహుల్‌ను కలిసేందుకు వెళ్లిన నారా బ్రాహ్మణి

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోడలు, ఏపీ మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణకు చేరుకున్నారు. హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రాహుల్‌ గాంధీ తాజ్‌కృష్ణ‌లో పారిశ్రామిక‌వేత్త‌ల‌తో స‌మావేశం కానున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో యువ పారిశ్రామికవేత్తగా రాణిస్తున్న బ్రాహ్మణి పాల్గొననున్నారు. తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశం కావాలని రాహుల్ నిర్ణయించుకోగా.. బ్రాహ్మణి సైతం ఈ సమావేశానికి వచ్చారు.

ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఉన్న బ్రాహ్మణిని ఈ సమావేశానికి ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పంపగా.. అందుకు ఆమె అంగీకరించినట్టు సమాచారం. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎటువంటి సౌకర్యాలు, సదుపాయాలను అందిస్తామనే అంశంపై రాహుల్ మాట్లాడి.. సమావేశానికి హాజరైన పారిశ్రామికవేత్తల నుండి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు.

Trending News