Delhi Exit Poll 2025: ఢిల్లీలో బీజేపీదే విజయం.. ఆశ్చర్యకరంగా ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు

Delhi Exit Poll 2025 Live Updates AAP Congress BJP Who Will Win: దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో విజేతగా నిలిచేది ఎవరు? అనేది ఉత్కంఠ నెలకొంది. పోలింగ్‌ ముగిసిన అనంతరం విడుదలైన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు లైవ్‌ అప్‌డేట్స్‌ ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 5, 2025, 08:22 PM IST
Delhi Exit Poll 2025: ఢిల్లీలో బీజేపీదే విజయం.. ఆశ్చర్యకరంగా ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు
Live Blog

Delhi Exit Poll 2025 Live Updates: దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ పోలింగ్‌ ముగియగా.. భారీగా ఓటింగ్‌ నమోదైంది. దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే ఈ ఎన్నికల్లో విజేత ఎవరో అనేది మూడు రోజుల్లో తేలనుంది. పోలింగ్‌ ముగిసిన అనంతరం విడుదలైన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మరోసారి ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం సాధించి హ్యాట్రిక్‌ ఘనత పొందుతుందా? కాంగ్రెస్‌ పూర్వ వైభవం సాధిస్తుందా? సుదీర్ఘ కాలం తర్వాత ఢిల్లీని బీజేపీ చేజిక్కించుకుంటుందా అనేది ఉత్కంఠ నెలకొంది.

విడుదలైన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు ఇలా ఉన్నాయి..

మొత్తం 70 స్థానాల్లో పార్టీల పోటీ ఇలా
ఆమ్‌ ఆద్మీ పార్టీ:
మొత్తం 70 స్థానాల్లో బరిలో దిగింది (ఇండియా కూటమిలో భాగమైన ఆప్‌, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ కలిసి పోటీ చేయలేదు)
కాంగ్రెస్‌ పార్టీ: 70 స్థానాల్లో పోటీ
ఎన్డీయే కూటమి: బీజేపీ 68, జేడీయూ 1, ఎల్‌జేపీఆర్‌వీ 1 స్థానంలో పోటీ చేయలేదు.

ఎన్నిక ఇలా
మొత్తం 70 స్థానాలు
పోటీ చేసిన అభ్యర్థులు
మొత్తం 699 మంది
మహిళా అభ్యర్థులు
96 మంది
మొత్తం ఓటర్లు
1.56 కోట్లు (పురుషులు83.8 లక్షలు, మహిళలు 72.4 లక్షలు, ఇతరులు 1,267 మంది)

5 February, 2025

  • 20:21 PM

    కాంగ్రెస్‌ పార్టీకి ఘోర పరాభవం
    ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల సరళి చూస్తుంటే ఈసారి కూడా కాంగ్రెస్‌ పార్టీకి ఘోర పరాభవం తప్పదని స్పష్టంగా తెలుస్తోంది. ఏ సర్వేలోనూ కూడా ఒకటి, రెండు మించి స్థానాలు రావని చెబుతున్నాయి. గత ఎన్నికల్లో ఒక్క సీటు పొందని కాంగ్రెస్‌ మరోసారి అదే పరిస్థితిని ఎదుర్కొంటుందని తెలుస్తోంది. సుదీర్ఘకాలం పాటు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్‌కు ఈ గతి పట్టడం గమనార్హం. ఇండి కూటమిగా పోటీ చేయకుండా ఆమ్‌ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేయడంతో కాంగ్రెస్‌కు భారీ దెబ్బ తగిలిందని విశ్లేషకులు చెబుతున్నారు.

  • 19:40 PM

    ఢిల్లీలో అధికారం చేపట్టేది బీజేపీ
    మరో రెండు సంస్థలు కూడా ఢిల్లీలో బీజేపీ విజయం సాధిస్తుందని వెల్లడించాయి. హోరాహోరీగా పోటీ నడిచినా కూడా చివరకు కమలం పార్టీ అధికారం సొంతం చేసుకుంటుందని పీపుల్స్‌ ఇన్‌సైట్‌, రిపబ్లిక్‌ పీమార్క్‌ సంస్థలు పేర్కొన్నాయి.

    పీపుల్స్‌ ఇన్‌సైట్
    ఆమ్‌ ఆద్మీ పార్టీ: 25-29 స్థానాలు
    బీజేపీ: 40-44 స్థానాలు‌
    కాంగ్రెస్‌ పార్టీ: 0-1

    రిపబ్లిక్‌-పీమార్క్‌
    బీజేపీ: 49 స్థానాలు
    ఆమ్‌ ఆద్మీ పార్టీ: 21-31 స్థానాలు
    కాంగ్రెస్‌ పార్టీ: 0-1 స్థానాలు

  • 19:34 PM

    చాణక్య
    బీజేపీ: 39- 44 స్థానాలు
    ఆమ్‌ ఆద్మీ పార్టీ: 25-28 స్థానాలు
    కాంగ్రెస్‌ పార్టీ: 2-3

    వీప్రిసైడ్‌
    ఆమ్‌ ఆద్మీ పార్టీ: 46-52 స్థానాలు
    బీజేపీ: 18- 23 స్థానాలు
    కాంగ్రెస్‌ పార్టీ: 0-1

    డీవీ రీసెర్చ్
    బీజేపీ: 36- 44 స్థానాలు
    ఆమ్‌ ఆద్మీ పార్టీ: 26-44 స్థానాలు

  • 19:24 PM

    కేకే సర్వే సంచలన ఫలితాలు
    ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలను పక్కాగా అంచనా వేసిన కేకే సంస్థ సంచలన ఫలితాన్ని వెల్లడించింది. అన్ని సర్వేలు బీజేపీ విజయం అని చెబుతుండగా.. కేకే సర్వే మాత్రం ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుందని ప్రకటించింది. కేకే ఎగ్జిట్ పోల్స్‌ ఆమ్‌ఆద్మీ పార్టీ హ్యాట్రిక్‌ విజయం సాధిస్తుందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర ఎన్నికల్లో కేకే అంచనా వేసిన ఫలితాలే రావడంతో ఢిల్లీలో ఆ సంస్థ చేసిన ఎగ్జిట్ పోల్స్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

    ఆమ్‌ ఆద్మీ పార్టీ: 39 స్థానాలు
    బీజేపీ: 21 స్థానాలు

  • 19:20 PM

    జేవీసీ సర్వే
    బీజేపీ: 39 నుంచి 45 స్థానాలు
    ఆమ్‌ఆద్మీ పార్టీ: 22 నుంచి 31 స్థానాలు
    కాంగ్రెస్‌ పార్టీ: 2 స్థానాలు

    పీ-మార్క్ సర్వే
    బీజేపీ: 39 నుంచి 49 స్థానాలు
    ఆమ్‌ఆద్మీ పార్టీ:  21 నుంచి 31 స్థానాలు
    కాంగ్రెస్ పార్టీ: ఒక స్థానం

  • 19:17 PM

    మ్యాట్రిజ్‌ ఎగ్జిట్ పోల్స్‌
    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై మ్యాట్రిజ్‌ సంస్థ కూడా బీజేపీదే విజయం ఉంటుందని తన ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడించింది. స్పష్టమైన మెజార్టీతో కమలం పార్టీ అధికారాన్ని సొంతం చేసుకుంటుందని పేర్కొంది.

    బీజేపీ: 35 నుంచి 40 స్థానాలు
    ఆమ్‌ఆద్మీ పార్టీ: 32 నుంచి 37 స్థానాలు
    కాంగ్రెస్‌ పార్టీ: ఒక స్థానం

  • 18:49 PM

    ఆత్మ సాక్షి
    ఢిల్లీలో కమలం పార్టీదే అధికారమని ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అధికారంలోకి రావడానికి 36 సీట్లు సాధించాల్సి ఉండగా బీజేపీకి అధికారం లభిస్తుందని వెల్లడించింది. 

    బీజేపీ: 38 నుంచి 41 స్థానాలు
    ఆమ్‌ ఆద్మీ పార్టీ: 27 నుంచి 30 స్థానాలు
    కాంగ్రెస్ పార్టీ: 1 నుంచి 3 స్థానాలు
    ఇతరులు: ఒకటి

    ఓట్ల శాతం ఇలా
    బీజేపీ: 47 శాతం నుంచి 47.5 శాతం
    ఆమ్‌ ఆద్మీ పార్టీ: 44 నుంచి 45 శాతం

  • 18:36 PM

    ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారం?
    ఢిల్లీలో సుదీర్ఘ కాలం తర్వాత బీజేపీ అధికారం చేపట్టబోతున్నదని పీపుల్స్ పల్స్ - కొడిమో సంస్థలు తమ ఎగ్జిట్‌ పోల్ ఫలితాల్లో వెల్లడించాయి. ఢిల్లీ ప్రజలు డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ వైపు నిలిచారని ప్రకటించింది.

    మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు
    బీజేపీ 51 - 60 సీట్లు
    ఆమ్‌ ఆద్మీ పార్టీ 10-19 సీట్లు
    కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా లభించకపోవచ్చు

Trending News