IPL 2022: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. రీ ఎంట్రీ ఇస్తున్న హాట్ యాంకర్‌! ఇక పండగే పో!!

Mayanti Langer to Re-Entry for IPL 2022. మరో నాలుగు రోజుల్లో ఆరంభం అయ్యే ఐపీఎల్ 2022లో మయంతి లాంగర్ రీఎంట్రీ ఇస్తున్నారని సమాచారం తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 22, 2022, 03:43 PM IST
  • ఐపీఎల్ అభిమానులకు శుభవార్త
  • రీ ఎంట్రీ ఇస్తున్న హాట్ యాంకర్‌
  • మార్చి 26న ఐపీఎల్ 2022 ఆరంభం
IPL 2022: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. రీ ఎంట్రీ ఇస్తున్న హాట్ యాంకర్‌! ఇక పండగే పో!!

Hot anchor Mayanti Langer to Re-Entry for IPL 2022: మయంతి లాంగర్.. ఐపీఎల్ అభిమాలకు సుపరిచితమైన పేరు. చక్కటి అందంతో పాటు మంచి వాక్‌ చాతుర్యంతో ఆకట్టుకునే మయాంతికి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. నిజం చెప్పాలంటే.. స్టార్ క్రికెటర్లకు ఆమెకు ధీటుగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మ్యాచ్‌కి ముందు, ఇన్నింగ్స్ బ్రేక్, మ్యాచ్ ముగిసిన తర్వాత స్టార్‌ స్పోర్ట్స్ స్టూడియోలో జరిగే చర్చల్లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. అందుకే మయంతి కోసమే ప్రత్యేకంగా మ్యాచ్ చూసే అభిమానులు కూడా ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

ఐపీఎల్ అఫీషియల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్‌ స్పోర్ట్స్ ఛానెన్‌లో యాంకర్‌గా బోల్డంత క్రేజ్ సంపాదించుకున్న మయంతి లాంగర్.. 2020లో మగ బిడ్డకు జన్మనిచ్చిన నేపథ్యంలో ఐపీఎల్ 2020, 2021 సీజన్‌లకు దూరమయ్యారు. అయితే మరో నాలుగు రోజుల్లో ఆరంభం అయ్యే ఐపీఎల్ 2022లో మయంతి రీఎంట్రీ ఇస్తున్నారని సమాచారం తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి స్టార్ స్పోర్ట్స్ వ్యాఖ్యాతల జాబితాలో మయంతి పేరు ఉందో లేదో తెలియాలంటే.. మరో 2-3 రోజులు ఆగాల్సిందే. ఐపీఎల్ 2022 మార్చి 26న ఆరంభం కానుంది.

1985 ఫిబ్రవరి 8న ఢిల్లీలో జన్మించిన మయంతి లాంగర్.. అక్కడి హిందూ కాలేజీలో గ్యాడ్యూయేషన్‌ పూర్తి చేశారు. కాలేజీలో నిర్వహించే కార్యక్రమాలకు ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించేవారు. ఇక పీజీ చేస్తుండగానే జీ స్పోర్ట్స్‌లో యాంకర్‌గా అవకాశం వచ్చింది. ఇక 2010లో ఫిఫా ప్రపంచకప్‌కి తొలిసారి వాఖ్యాతగా వ్యవహరించారు. 2010లో కామన్వెల్త్‌ క్రీడలకు టీవీ ప్రెజెంటర్‌గా చేశారు. అక్కడి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. ఐపీఎల్‌, ప్రపంచకప్‌లకు వ్యాఖ్యాతగా కొనసాగుతున్నారు. 

సుదీర్ఘకాలంగా స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానల్‌లో పనిచేస్తున్న మయంతి లాంగర్.. భారత క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ సతీమణి అన్న విషయం తెలిసిందే. బిన్నీ సతీమణి కంటే.. యాంకరింగ్ ద్వారానే మయంతి పాపులర్ అయ్యారు. వస్త్రధారణ విషయంలో ఆమె నిత్యం ట్రోలింగ్‌కు గురువతూ ఉంటారు. బిన్నీ విషయంలో కూడా అభిమానులు గేలి చేసే ప్రయత్నం చేస్తారు. అయితే అభిమానుల ట్రోలింగ్‌ను మయంతి తనదైన శైలిలో తిప్పుకొడుతారు. ఏదేమైనా ఐపీఎల్ 2022లో మయంతి ఉంటే అభిమానులు పండగ చేసుకోవడం మాత్రం ఖాయం. 

Also Read: Deepika Padukone: బాగా హర్ట్ అయిందిగా.. మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన దీపికా పదుకొనె!!

Also Read: IPL 2022: వైరల్ పిక్.. చిరంజీవి హీరోయిన్‌ను చంకనెత్తుకున్న క్రికెట్ కామెంటర్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News