AP 10th Supplementary Results check on www.bse.ap.gov.in: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. నేడు ఉదయం 11 గంటలకు రిజల్ట్స్ రానున్నాయి. https://www.bse.ap.gov.in/ వెబ్సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు..
Monsoons Effect in AP & TG: తెలుగు రాష్ట్రాల్లో రుతు పవనాలు విస్తరిస్తుండడంతో వర్షాలు మొదలయ్యాయి. భానుడి ప్రకోపానికి అల్లాడిపోయిన ప్రజలు.. వర్షాల రాకపోతో ఊపిరి పీల్చుకుంటున్నారు. అన్నదాతలు పంటలు సాగు చేసేందుకు రెడీ అవుతున్నారు. నేడు ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్లో కరెంట్ ఛార్జీలు పెంచడంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏడుసార్లు కరెంట్ బిల్లులు పెంచారని అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Jagananna Animutyalu Prize Money: టెన్త్, ఇంటర్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఏపీ ప్రభుత్వం సత్కరించనుంది. నగదు ప్రోత్సాహంతోపాటు సర్టిఫికెట్, మెడల్ అందజేయనుంది. రేపు సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా అందజేయనున్నారు. విద్యార్థులకు ఎంత ప్రైజ్ మనీ అందనుందంటే..?
Protest In Chhattisgarh Against Adipurush: పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆదిపురుష్.. బాక్సాఫీసు వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. అయినా కలెక్షన్ల పరంగా జోరు తగ్గడం లేదు. రెండు రోజులకు రూ.200 క్లబ్లో చేరింది.
Pawan Kalyan Varahi Yatra: తాను ఎన్నికల ముందు అది చేస్తా.. అన్నీ ఇచ్చేస్తా.. అని చెప్పనని తాను చేసేది మాత్రమే అన్నీ ఆలోచించి చెప్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను ఒకసారి మాట ఇచ్చిన తర్వాత తల తెగినా దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. సినిమాలు వేరు.. రాజకీయం వేరు అన్న జనసేనాని.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, చిరంజీవి ఇలా అందరి హీరోలు అభిమానులు ఆలోచించి ఓట్లు వేయాలని రిక్వెస్ట్ చేశారు.
Pawan Kalyan Speech in Varahi Yatra: వచ్చే ఎన్నికల్లో తనను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎవడూ ఆపలేడని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాలతో తనను ఓడిపోయేలా చేశారని ఫైర్ అయ్యారు. కత్తిపూడిలో జనసేన నిర్వహించిన భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
AP EAPCET 2023 Results: ఏపీఈఏపీసెట్ 2023 ఫలితాలు వచ్చేశాయి. https://cets.apsche.ap.gov.in/ లింక్పై క్లిక్ చేసి విద్యార్థులు ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
Janasena Varahi Yatra Schedule: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. అన్నవరం సత్యదేవుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యాత్రను మొదలుపెట్టనున్నారు. వారాహి యాత్రకు జనసేన నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
Pawan Kalyan Participates in Yagam: మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ యాగం చేపట్టారు. సోమవారం ఉదయం మొదలైన ఈ యాగం మంగళవారం కూడా కొనసాగనుంది. పవన్ కళ్యాణ్ పట్టు వస్త్ర ధారణలో పాల్గొన్నారు.
CM Jagan Tour in Palnadu: సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. క్రోసూరులో జగనన్న విద్యాకానుక కిట్స్ను అందజేయనున్నారు. స్కూళ్లు ప్రారంభం రోజే విద్యార్థులకు బహుమతిగా సీఎం జగన్ ఈ కిట్స్ను పంపిణీ చేస్తున్నారు. ఈ కిట్లో ఏమున్నాయంటే..?
Parvathipuram YSRCP MLA Alajangi Jogarao: పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావుపై బలిజిపేట మండలం పి.చాకరాపల్లి ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమ గ్రామానికి రోడ్లు వేసినందుకు గ్రామంలో ఊరేగింపు చేసి పూలవర్షం కురిపించారు. అనంతరం బిందేలతో పాలభిషేకం నిర్వహించి.. కృతజ్ఞతలు చెప్పారు.
AP Schools Summer Holidays: ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు రీఓపెన్ కానున్నాయి. అయితే ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో భారీ ఎండల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి ఈ నెల 17వ తేదీ వరకు ఉదయం ఉ.7.30 నుంచి మ.11.30 వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
AP Schools Summer Holidays Extension: ఆంధ్రప్రదేశ్లో సోమవారం నుంచి స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి. వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలల పునఃప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే రాష్ట్రంలో ఇంకా ఎండలు భారీ ఉన్న నేపథ్యంలో స్కూళ్ల ప్రారంభాన్ని వాయిదా వేయాలని అన్ని వైపులా డిమాండ్ వస్తోంది.
CM Jagan Review On Education Department: అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్ సదుపాయ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. సెప్టెంబర్ నెల చివరి వరకు 45 వేల స్కూళ్లలో ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని అధికారులు వివరించారు. డ్రాప్అవుట్స్ లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
AP Cabinet Today Meeting Highlights: ఏపీలో నిరుద్యోగులకు గుడ్న్యూస్. వివిధ శాఖల్లో 6,840 కొత్త పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా 10 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలైజేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
CM Jagan Inspects Polavaram Project Works: డయా ఫ్రం వాల్ దెబ్బతినడంతోనే పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆలస్యం అవుతున్నాయని సీఎం జగన్ అన్నారు. అంతేకాకుండా రూ.2 వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Contract Employees Regularization in AP: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించిన ప్రభుత్వం.. ఈ మేరకు క్రమబద్ధీకణకు అంగీకరించింది. ఇందుకు సంబంధించి త్వరలోనే ఉత్వర్వులు వెలువడనున్నాయి.
AP Passengers in Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో చిక్కుకున్న ఏపీ వాసులను వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సేకరిస్తోంది. రెండు రైళ్లలో మొత్తం 695 మంది రాష్ట్రానికి చెందిన వారు ప్రయాణించగా.. వీరిలో 553 మంది సురక్షితంగా ఉన్నారు. 92 మంది ప్రయాణం చేయలేదు. 28 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
AP Passengers in Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో ఏపీకి చెందిన 316 మంది సురక్షితంగా ఉన్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మరో 141 మంది గురించి సమాచారం తెలియాల్సి ఉందని.. వారి కోసం ముమ్మర చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.